జనసైనికుడికి రూ. లక్ష ఆర్ధిక సాయం

గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం గ్రామానికి చెందిన జనసైనికుడు శ్రీ షేక్ ఖాదీర్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ ఆర్ధిక పరిస్థితి సరిగా లేనందున వైద్య ఖర్చులకు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. శ్రీ షేక్ ఖాదీర్ వైద్య ఖర్చుల నిమిత్తం జనసేన పార్టీ తరఫున లక్ష రూపాయల ఆర్ధిక సాయం అందించారు. హైదరాబాద్ ప్రశాసన్ నగర్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ మొత్తాన్ని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు చెక్ రూపంలో ఖాదీర్ సోదరుడు శ్రీ ఖాజావలికి అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎన్ఆర్ఐ జనసైనికులు తమవంతు సహకారం అందించారు.