శ్రీమతి కాంతిశ్రీ సమక్షంలో భారీ చేరికలు

ఎచ్చెర్ల నియోజకవర్గం, లావేరు మండలం, కొత్తకోట పంచాయతీ వైఎస్సార్సీపీ ఎంపిపి(మండల ప్రెసిడెంట్) సొంత పంచాయితీలో దళిత కుటుంబాలకు చెందిన వ్యక్తులు 40 కుటుంబాలు జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి, జనసేఅన్ అధినేత పవన్ కళ్యాణ్ అశయాలకు ఆకర్షితులై ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి కాంతిశ్రీ అధ్వర్యంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. వీరికి ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి కాంతిశ్రీ జనసేన పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి కాంతిశ్రీ మాట్లాడుతూ జనసేన పార్టీని బలోపేతం చేయడం కోసం మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేయడానికి అందరు బలంగా కృషి చేయాలని కోరడం జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను, ఆశయాలను విస్తృతంగా ప్రజలలోకి తీసుకెళ్ళాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.