గోదావరిఖని టూటౌన్ పోలీస్ స్టేషన్ సీఐకి వినతిపత్రం

రామగుండం, జనసేన పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండం నియోజకవర్గం పరిధిలోని ఇంక్లైన్ కాలనీలో జనసేన పార్టీ బలోపేతం చేసే భాగంగా ఉమ్మడి కరీంనగర్ యువజన అధ్యక్షులు రావుల మధు సూచనల మేరకు జనసేన జెండా దిమ్మ నిర్మించాలని స్థలం పరిశీలించిన రామగుండం నియోజకవర్గం జనసేన నాయకులు. అనంతరం గోదావరిఖని 2టౌన్ పోలీస్ స్టేషన్ సీఐకి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఇందులో భాగంగా జనసేన రామగుండం యువజన అధ్యక్షులు ఎముర్ల రంజిత్ ఉపాధ్యక్షులు మోతే రవికాంత్, ఆర్గనైజింగ్ సెక్రటరి పోట్ల శశాంక్, సెక్రటరీ శరత్ నాయక్, నాయకులు తుంగపల్లి కుమార్, రాము, పవన్, జనసైనికులు పాల్గొన్నారు.