జనసేన, టిడిపి పార్టీల జెండా ఆవిష్కరించిన కోడి చంద్రయ్య

ఐరాల: ఐరాల బంగారుపాళ్యం మండలం లక్ష్మీపురంలో జనసేన, తెలుగుదేశం పార్టీ జెండాను బంగారుపాళ్యం మండలం జనసేన పార్టీ మండల అధ్యక్షుడు కోడి చంద్రయ్య మండల ఉపాధ్యక్షులు బాలు గ్రామస్తుల ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఐరాల మండలం, గుబలవారిపల్లి ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి ఏపీ శివయ్య, పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి నెహ్రు రాయల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శివప్రసాద్ బంగారుపాళ్యం మండలం కమిటీ సభ్యులు, జనసేన పార్టీ పూతలపట్టు మండల అధ్యక్షుడు మనోహర్, కేజీ సత్రం కిషోర్ కుమార్, తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.