ఉదయగిరి జనసేన ఆద్వర్యంలో జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు

ఉదయగిరి: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు, నెల్లూరు జిల్లా చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి ఆదేశాలు మేరకు, వింజమూరి మండల ఉపాద్యక్షులు సుభాని ఆధ్వర్యంలో 12,13,14 తీదీలలో జరుగుతున్న జగనన్న ఇల్లు పేదలందరికీ కన్నీళ్లు కార్యక్రమంలో భాగంగా పేదలందరికీ ఇల్లు అనే పథకం ద్వారా ప్రజలకు చేసిన వైయస్సార్ ప్రభుత్వం చేస్తున్న మోసన్ని తెలియజేస్తూ #JaganannaMosam హ్యాష్ టాక్ తో ఉదయగిరి మండలంలోని ప్రజలకు ఇచ్చిన ఇంటి స్థలాలు వెళ్ళి సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుభాని మాట్లాడుతూ వింజమూరి పట్టణాన ప్రాంతంలో రెండు సంవత్సరాల నివాస స్థలాలు ఇవ్వడం జరిగిందని కానీ ఇప్పుడు వరకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని ఒక ఇటుక ముక్క కూడా వేసిన దాఖలాలు లేవని గతంలో కూడా ప్లాట్లు పంపిణీ సమయంలో అవకతవకలు జరిగాయని మండల తాసిల్దార్ కార్యాలయంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలపడం జరిగినదని, ప్రస్తుతం ఈ ప్రాంతంలో స్థలాలు దేనికి పనికి రాకుండా పిచ్చి మొక్కలు ముగిసి , కంపచెట్లు పెరిగి ఉన్నాయని అధికారులు కూడా పట్టించుకున్న పరిస్థితి లేదని ఇకనైనా ప్రభుత్వం మేల్కొని ఆర్భాటాలకు వెళ్లకుండా త్వరగా పేదలందరికీ గృహాలు కట్టించి ఇవ్వవలసిందిగా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుభాని, పింటు, అబ్బులు పాల్గొన్నారు.