సాకే భారతిని అభినందించిన జనసేన నేతలు

సింగనమల నియోజకవర్గం: నియోజకవర్గపరిధిలో సింగనమల మండలంలోని నాగులగుడ్డం గ్రామంలో ఒక నిరుపేద కుటుంబంలో పుట్టి, కూలి పనులు చేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తూ పి.హెచ్.డి డాక్టరేట్ పట్టా అందుకున్న గిరిజన చదువుల తల్లి సాకే భారతిని సన్మానించడానికి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్, జిల్లా అధికార ప్రతినిధి సాకే మురళికృష్ణ, శింగనమల మండల అధ్యక్షులు తోట ఓబులేసు కలిసి ఆదివారం సాకే భారతిని సన్మానించి, పది వేల రూపాయలు మరియు పట్టుచీర ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. సాకే భారతి పట్ల ఎమ్మెల్యే పద్మావతి అవమానకరంగా ప్రవర్తించడం చాలా బాధాకరం. ఈ విషయాన్ని జనసేన అదినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి భారతికి ఇంటి విషయం అలాగే ఉద్యోగ విషయం తెలియజేసి న్యాయం జరిగే విధంగా చేస్తామని జిల్లా అధ్యక్షులు టీసీ వరుణ్ భరోసా ఇవ్వడం జరిగంది. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న గార్లదిన్నే మండల అధ్యక్షులు గోగుల తాతయ్యను మర్తాడు గ్రామానికి వెళ్లి అతని స్వగృహంలో పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ఉపాధ్యక్షుడు అంకె ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శులు జయమ్మ, కృష్ణమూర్తి, ముప్పురు కృష్ణ, కిరణ్ కుమార్, నగర అధ్యక్షులు పొదిలి బాబురావు, మండల ఉపాధ్యక్షులు సాయి కుమార్, యువ నాయకుడు తోట రామ మోహన్, ఆది, తాతయ్య, లాల్ స్వామి, పవనిజం రాజు, మల్లి తదితరులు పాల్గొన్నారు.