వరికూటి సమక్షంలో జనసేనలో చేరికలు

దర్శి నియోజకవర్గంలోని కురిచేడు మండలం నాంచారపురం గ్రామంలో రాత్రి సమయంలో కూడా గ్రామ సమస్యలను తెలుసుకుంటూ జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి అని పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తూ రాబోయే ఎలక్షన్లలో పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా గ్రామ పెద్దలతో యువకులతో దర్శి నియోజకవర్గం జనసేన నాయకులు వరికూటి నాగరాజు మాట్లాడడం జరిగింది. ఆనంతరం గ్రామంలోని 50 కుటుంబాలకి జనసేన కండువాలని కప్పి జనసేన పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఏపీజీబీ రిటైర్డ్ చీఫ్ మేనేజర్ కొల్లా హనుమంతరావు మరియు షేక్ ఇర్షాద్ లు కూడా గ్రామ జనసైనికులతో మాట్లాడడం జరిగినది. కాలువ కోటేష్, కాలువ యలమంద, కాలువ నారాయణ, కాలువ సత్యం మరియు వీర మహిళలు శ్రీ మహాలక్ష్మి, సుబ్బమ్మ, రంగమ్మ, కోటమ్మ, సంజీవమ్మ పాల్గొనడం జరిగినది.