పిడుగు పాటుతో మరణించిన కారి హరి కుటుంబానికి అండగా జనసేన

భోగాపురం మండలం, చేపల కంచేరు గ్రామంలో పిడుగు పాటుకి గురై మరణించిన కారి హరి కుటుంబాన్ని జనసేన నాయకులు పరామర్శించి జనసేన పార్టీ తరపున 10000 రుపాయలు నగదు అందజేసి వారికి ప్రతి నెల పెన్షన్ రూపంలో 3000 ఒక బియ్యం ప్యాకెట్ ఇచ్చి ఆ కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వడం జరిగింది.. ఈ కార్యక్రమంలో మత్స్యకార కార్యదర్శి కర్రి అప్పలరాజు, భోగాపురం మండల టీమ్, పల్ల రాంబాబు, జేయెష్ కావుంగల్, వందనాల రమణ, పిడుగు జోగారావు, శిరుగుడి వెంకటేష్, శంకర్ పైలా, రాము, శ్రీను పాల్గొనడం జరిగింది.