ఘనంగా క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

రాజోలు నియోజకవర్గం అరవపాలెం గ్రామంలో జనసేన నాయకులు ఉలిశెట్టి లక్ష్మణరావు ఆధ్వర్యంలో జనసేన పార్టీ రాజోలు మండల అద్యక్షులు సూరిశెట్టి శ్రీను అద్యక్షతన ఆదివారం ఘనంగా క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి మరియు నియోజకవర్గ స్థాయి జనసేన నాయకులు మరియు జనసైనికులు, గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.