న్యాయవాదులకు మద్దతుగా నిలిచిన జనసేన పార్టీ

హుస్నాబాద్ నియోజకవర్గం, తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ ఆదేశాల మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో సబ్ కోర్టు ఏర్పాటు చేయాలని గత కొన్ని రోజులుగా న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహారదీక్షకు జనసేన పార్టీ మద్దతు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ నాయకులు తగరపు శ్రీనివాస్ మాట్లాడుతూ అర్జీదారులు వారి సమస్యల పరిష్కారం కోసం అందుబాటులో ఉండేట్లు సబ్ కోర్టు ఏర్పాటు చేయాలని, ఈ పోరాటానికి జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పొడిశెట్టి విజయ్, మొలుగూరి అరవింద్, జేరిపోతుల సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.