గ్రంధాలయాన్ని పరిశీలించిన బాబు పాలూరు

బొబ్బిలి నియోజకవర్గం: బొబ్బిలి లో ఉన్న ఏకైక గ్రంథాలయంలో ఆదివారం రాత్రి దొంగతనం జరిగిందని తెలుసుకొని, సోమవారం ఉదయం గ్రంధాలయాన్ని పరిశీలించిన జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బాబు పాలూరు, బొబ్బిలి నాయకులు మరియు వీరమహిళలు. ఎమ్మెల్యే ఇచ్చిన హామీ ప్రకారం కొత్త గ్రంథాలయం ఎలాగూ కట్టలేకపోయారు, కనీసం గ్రంథాలయం మరమ్మత్తులైనా పూర్తి చేసి, చదువరులకు కావలసిన మౌలిక సదుపాయాలు మరియు ఇలా దొంగతనాలకు తావు లేకుండా సీసీటీవీ కెమేరాలైనా ఏర్పాటు చెయ్యండని బాబు పాలూరు గారు స్థానిక ఎమ్మెల్యే శంబంగి చినప్పలనాయుడుని కోరారు.