ఆపదలో ఉన్న జనసేనాని అభిమానికి నందలూరు జనసేన అండ

ఉమ్మడి కడప జిల్లా, నందలూరు మండలం, చెన్నయ్యగారిపల్లిలో నివసించే పవన్ కళ్యాణ్ అభిమాని గంగాధర్ కి 8నెలల క్రితం యాక్సిడెంట్ కు గురై పూర్తిగా కాలు పొగొట్టుకోవడం జరిగింది. గంగాధర్ కి వృద్ధ తల్లిదండ్రులు, భార్య, కూతురు వున్నారు. పెళ్ళి అయిన 6నెలలకే ఈ దుర్ఘటన జరిగింది. ఇంత వరకు ఇతనికి ప్రభుత్వం ద్వారా ఎటువంటి సాయం అందలేదు. ఈ విషయం బాధితుడి ద్వారా తెలుసుకున్న నందలూరు జనసైనికుడు మస్తాన్ రాయల్ కువైట్ జనసైనికుడు కొట్టే.శ్రీహరి దృష్టికి తీసుకువెళ్ళ్డంతో‌‌‌ ఆతనికి మన చేతనైన సాయం చెయ్యాలని భావించి నందలూరు జనసైనికులు వాట్సప్ గ్రూపులో బాధితుడి గురించి పోస్టు చెయ్యడంతో నందలూరు జనసైనికులు కొట్టే శ్రీహరి, ఉర్లకుంట శ్రీహరి, చెన్నంశెట్టి శివ కృష్ణ, అబ్బనగారి రాజ, దద్దమ్ రాముడు, నరసింహా చెర్రి, మస్తాన్ రాయల్, భరతాల ప్రసాంత్, పసుపులేటి రాఘవ, ఆర్యన్ భరత్, లేబాక నరేష్, దాసరి రామయ్య, అజయ్ ప్రసన్న, నాగార్య, అప్పన‌ చిరంజీవి స్పదించి విరాళాలు ఇచ్చారు. వచ్చిన విరాళాలలతో భాధితుడికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులు, కూరగాయలతో పాటు 13,000 రు.ల అర్థిక సాయం అందజేయడం జరిగింది. అలాగే భవిష్యత్తులో జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని, వచ్చిన వెంటనే గంగాధర్ కి వికలాంగుల కోటలో ఒక ఉద్యోగం వచ్చేలా ప్రయత్నం చేస్తామని జనసేన నాయకులు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నందలూరు జనసేన కార్యకర్తలు కొట్టే నరసింహులు, డద్దమ్ రామయ్య, ప్రశాంత్ భారతాల, మస్తాన్ రాయల్, తిప్పాయపల్లి ప్రశాంత్, లంకయ్య గారి వెంకటసాయి, హరిబాబు, కాంతురి సురేష్, ఇతర చెన్నయ్యగారిపల్లి గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.