జాతీయ రైతు దినోత్సవ వేడుకలలో ఒంగోలు జనసేన

ఒంగోలు: ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ ఆదేశాల మేరకు, ఒంగోలు నియోజకవర్గం, కొత్తపట్నం మండలంలో జనసేన నాయకులు పలు గ్రామాల పొలాల్లో యువ రైతులతో మమేకమై పవన్ కళ్యాణ్ కౌలు రైతులకు అందించిన సహాయాన్ని వివరిస్తూ రైతే రాజు అనే పదాన్ని పవన్ కళ్యాణ్ గారు సి.యం అయితే ప్రజలకు చేసి చూపుతారని, ఒకసారి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇవ్వాలని రైతులకు తెలియజేస్తూ, రైతు దినోత్సవాన్ని జరుపుకుంటూ, రైతులు అందరూ పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించాల్సినదిగా కొరడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మత్స్యకార వికాస విభాగం కార్యదర్శి పొక్కింగారి రాజు, కొత్తపట్నం మండల ఉపాధ్యక్షులు తెలగంశెట్టి మహాదేవ, మండల ప్రధాన కార్యదర్శి బచ్చు శ్రీకాంత్, మండల కార్యదర్శి పొక్కింగారి బాబురావు, ఈతముక్కల గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు స్వర్ణ వినోద్ కుమార్, మండల జనసేన నాయకులు కొండూరి ఏడుకొండలు, పొక్కింగారి శామ్యూల్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.