జనసేన టీ షర్ట్స్ ను ఆవిష్కరించిన నాదెండ్ల

పాలకొండ నియోజకవర్గం జనసేన నాయకులు, పాలకొండ- జనసేన.. మనల్ని ఎవద్రా ఆపేది లొగో తో టీ షర్ట్స్ ను ముద్రించడం జరిగింది. ఈ టీ షర్ట్స్ ను జనసేన పార్టీ రాష్ట్ర పి ఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ చేతులమీదుగా శ్రీమతి పాలవలస యశ్వసి సమక్షంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా జామి అనిల్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఇప్పటి వరుకు డి. యస్సీ నోటిఫికేషన్ తియ్యకపోవడంతో ఎక్కువ సాతం యువత ప్రవేట్ జాబ్స్ చేసుకోవడం జరుగుతుంది. కనీస వేతనాలు లేక కుటుంబం పోషనకి చాలా ఇబ్బందులకు గురికావలిసి వస్తున్న విషయం పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ నాయుకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.