యువశక్తి ప్రచారంలో శ్రీమతి పరిమి భువనేశ్వరి

తగరపువలస: జనవరి 12న జనసేన పార్టీ నిర్వహిస్తున్న యువశక్తి కార్యక్రమం ప్రచారంలో భాగంగా మంగళవారం తగరపువలస కూడలి వద్ద, 1వార్డు పరిధిలో మరియు బాసర కాలేజ్ వద్ద జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి పరిమి భువనేశ్వరి ఆటోలకి యువశక్తి సభ స్టికర్స్ అంటించారు, వార్డులో ప్రచారం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మన యువత మన భవిత పేరున యువత కోసం, యువత భవిష్యత్తు కోసం జనవరి 12వ తేదీన రణస్థలంలో నిర్వహించబోయే యువశక్తి సభ యువతకి ఎంత ముఖ్యం అనే విషయం తెలియజేస్తు బహిరంగ సభకు అందరినీ ఆహ్వానించారు.