రాజేష్ పై దాడినీ నిరసిస్తూ బుర్రా సూర్య ప్రకాశరావు మద్దతు

పిఠాపురం: రాజమండ్రిలో మహాసేన అధినేత సరిపేల్ల రాజేష్ పై జరిగిన దాడికి జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇంచార్జి శ్రీమతి మాకినీడి శేషుకుమారి నిరసిస్తూ వారికి మద్దతు తెలియజేశారు. పిఠాపురం నియోజవర్గం నాయకులను సరిపెల్ల రాజేష్ ను పరామర్శించి వారికి ధైర్యం నింపాలని ఆదేశించారు. శేషు కుమారి ఆదేశానుసారం రాజేష్ ఇంటికి వెళ్లి దాడికి సంబంధించిన విషయాలు అడిగి తెలుసుకుని వారికి మద్దతుగా నిలిచి ధైర్యం నింపడం జరిగింది. ఈ సందర్భంగా రాజేష్ కు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చిత్రపటం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పిఠాపురం పట్టణం నాయకులు బుర్రా సూర్యప్రకాశరావు, కసిరెడ్డి నాగేశ్వరరావు, మైనాబత్తుల చిన్న, నామ శ్రీకాంత్, చిన్న, దాకే బుజ్జి, కాకర నాగు, కాశి వీరబాబు, తిరగట్టి సతీష్, పిన్ని పల్లి పవన్, జన సైనికులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.