పవనన్న పాలనతోనే పేదల సంక్షేమం.. రాటాల రామయ్య

  • పవనన్న ప్రజాబాట 61వ రోజు

రాజంపేట: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యి పాలన సాగిస్తేనే రాష్ట్రంలోని పేదల సంక్షేమం సాధ్యమవుతుందని జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య పేర్కొన్నారు. రాజంపేట జనసేన పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు 61వ రోజు పవనన్న ప్రజాబాట కార్యక్రమాన్ని జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బుధవారం ఒంటిమిట్ట మండలం గంగ పేరూరు పంచాయతిలోని పెన్నపేరూరు, ఎస్సీ కాలనీలో పవనన్న ప్రజాబాట కార్యక్రమం నిర్యహించారు. కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని జనసేన పార్టీ రూపొందించిన మేనిఫెస్టో కరపత్రాలను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య మాట్లాడుతూ.. ప్రజలందరూ ఆదరించి రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.