నర్సీపట్నంలో ఘనంగా పవన్ కళ్యాణ్ మాతృమూర్తి అంజనా దేవి జన్మదిన వేడుకలు

నర్సీపట్నం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాతృమూర్తి అంజనా దేవి జన్మదిన వేడుకలు ఆదివారం నర్సీపట్నంలో ఘనంగా జరిగాయి. నర్సీపట్నం లో అంజనా దేవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ అధ్యక్షులు పెనుపోతల నాగు కోశాధికారి కొత్తకోట రామ్ శేఖర్, మంత సంతోష్, సానపల్లి శ్రీకర్, పత్యాల హర్ష నర్సీపట్నం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పెదబొడ్డేపల్లి నిరాశ్రయుల వసతి గృహంలో నిరాశ్రయులకు భోజనాలు అందించారు. సాయంత్రం కేక్ కటింగ్ చేసి తదనంతరం రోడ్డు మీద నిరాశ్రయులకు దుప్పట్లు పంపిణీ చేశారు.