నారాయణస్వామి కుటుంబానికి 5 లక్షల ఇన్సూరెన్స్ చెక్ అందజేత
- చనిపోయిన జనసేన కార్యకర్త నారాయణస్వామి కుటుంబానికి 5 లక్షల రూపాయల ప్రమాద బీమా అందజేసిన జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు టిసి వరుణ్ ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి
సింగనమల నియోజకవర్గం, నార్పల మండలం కేశేపల్లి గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త నీలూరు నారాయణస్వామి మరణించడంతో ఆయన కుటుంబానికి జిల్లా అధ్యక్షుడు టిసి వరుణ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి 5 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు టిసి వరుణ్ మాట్లాడుతూ జనసేన పార్టీలోని కార్యకర్తలకు నాయకులకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికీ వారి కుటుంబానికి అండగా ఉంటారని వారి కుటుంబ సభ్యులకు అన్నదండలు ఇస్తారని భరోసా కల్పించి ధైర్యమిచ్చి అండదండలుగా ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ ప్రాంతీయ వీరమహిళ పసుపులేటి పద్మావతి, కార్యక్రమాల నిర్వహణ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భవాని రవికుమార్, నార్పల మండల కన్వీనర్ గంజికుంట రామకృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు, మండల కమిటీ అధ్యక్షులు, జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-09-at-3.30.55-PM-1-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-09-at-3.30.55-PM-1024x575.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/02/WhatsApp-Image-2023-02-09-at-3.30.54-PM-2-1024x575.jpeg)