విజయవంతంగా వారాహి విజయ యాత్ర

విజయనగరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం, వైఎస్ఆర్ పార్టీ రాక్షస పాలన నుండి విముక్తి కలిగించేందుకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి విజయ యాత్ర తొలిదశ విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ తొలిదశ యాత్రలో వైసీపీ ప్రభుత్వ కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిపై స్పందించారు జనసేనాని. వాటిలో ముఖ్యమైనవి. దళితుల సంక్షేమ పథకాలు, నిరుద్యోగ యువత, ఉపాధి అవకాశాలు, విద్యార్థుల కష్టాలు, సౌకర్యాలు లేని దుస్థితి రైతుల సమస్యలు, ఆత్మహత్యలు, పంట నష్ట బీమా పట్టు పరిశ్రమ కార్మికుల కష్టాలు దీనస్థితిలో ఉన్న వైద్య శాఖ, కనీస వసతులు లేని హాస్పిటల్స్, వెనుకబడిన వర్గాల సమస్యలు, వారి అభివృద్ధి ప్రణాళికలు అధ్వాన్నంగా మారిన రోడ్ల సమస్య, పంట కాలువల దుస్థితి, పిఠాపురం చెరువుల ద్వంసం, అక్రమ మట్టి తరలింపు, కాకినాడలో ద్వారంపూడి రౌడి రాజకీయాలు, దోపిడీలు, గంజాయి హబ్ గా మారిన కాకినాడ, టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ అవినీతి భాగోతం, అక్రమ ఇసుక త్రవ్వకాలు, గోదావరి గ్రామాల్లో బ్రిడ్జి ఏర్పాటు, కోనసీమ రైల్వే లైన్, కొబ్బరి రైతులు, మత్స్య కారుల, సమస్యలు, పరిష్కారాలు, ఆక్వా కల్చర్, పారిశ్రామిక విధానం, యువతకు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్, ఇలా మరెన్నో అంశాలపై వైసీపీ ప్రభుత్వ అసమర్థ వైఖరిని ఎండగట్టారు. రానున్న కాలంలో వైసీపీ ప్రభుత్వ అంతానికి శ్రీకారం చుట్టింది వారాహి విజయ యాత్ర. మరికొద్ది రోజుల్లో మొదలవనున్న మలిదశ వారాహి విజయ యాత్ర ప్రారంభం అవుతుంది, సహకరించిన నాయకులు జన సైనికులకు వీర మహిళలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ గ్రామస్థాయిలో పార్టీ బలోపతం దిశగా ప్రతి జనసైనికుడు కష్టపడాలని పిలుపునిచ్చారు. గాజు గ్లాసు గుర్తుకు ఓటేద్దాం, జనసేన ప్రజా ప్రభుత్వాన్ని తీసుకొద్దాం అని అన్నారు.