ఆపదలో ఉన్న కార్యకర్తలకు ఆర్థిక సహాయం అందజేసిన జనసేన

ఇటీవల కూనవరం గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్త కొప్పిశెట్టి రామస్వామి ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తో మరణించగా ఆ కుటుంబానికి 20వేల రూపాయలు అందించినవారు. లింగోలు పండు టీం 10 వేల రూపాయలు, ఆకులు మూర్తి టీం 5 వేల రూపాయలు, అమలాపురం పార్లమెంట్ నాయకులు నల్లా శ్రీధర్ 5 వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. గోపవరం గ్రామానికి చెందిన నాగాబత్తుల ప్రసాద్ కిడ్నీ వ్యాధితో బాధపడుతుండగా ఆకుటుంబానికి 15 వేల రూపాయలు, లింగోలు పండుగారి టీమ్ 5 వేల రూపాయలు, ఆకుల సూర్య నారాయణ మూర్తి టీం 5 వేల రూపాయలు, ఇసుక పట్ల రఘుబాబు, అయితాబత్తుల ఉమామహేశ్వర రావు, వుండ్రు భగవాన్ దాస్ 5 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో అయితాబాత్తుల కృష్ణారావు, కొప్పుల నాగమానస, బసవా చినబాబు, గాలి నారాయుడు, తిక్కా శేషుబాబు, వాకపల్లి వెంకటేశ్వరరావు, ఆకుల శ్రీనివాసరావు, బండారు వెంకన్నబాబు, నిమ్మకాయల రాజేష్, నల్లా వెంకటేశ్వరరావు, నూకల రాజా, గెడ్డం చినబాబు, పోలిశెట్టి బాబులు, మారిసెట్టి కృష్ణమూర్తి, గనిసెట్టి వీరు, మారీసెట్టి నాని, గంధం శ్రీను, మారిసెట్టి పవన్, నిమ్మకాయల సాయి, కొరసాల కేశవరావు,డి.ఎస్.ఎన్. కుమార్, ఆకుల బాబ్జి, ములపర్తి దుర్గరాజు, ఆకుల సుబ్రమణ్యం, చీకట్ల వేణు, గొలకోటి గోవిందరాజు, తదితరులు పాల్గొన్నారు.