అంబేద్కర్ కు జనసేన కిషోర్ గునుకుల ఘననివాళి

నెల్లూరు: డా.బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్బంగా జనసేన కిషోర్ గునుకుల ఘననివాళి అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వారితో మాట్లాడకూడదు.. వీరిని తాకకూడదు.. వారు చదువు కోకూడదు.. వీరు రాజకీయం చేయకూడదు.. అంటూ అనేక రుగ్మతలను రూపుమాపడానికి ఆ రోజుల్లోనే పునాది వేసి ప్రపంచం గర్వించదగ్గ భారత రాజ్యాంగ రచయిత, గొప్ప రాజకీయవేత్త, న్యాయవాది, అన్నింటికీ మించి గొప్ప సంఘసంస్కర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి.. నిజంగా భారతీయులకు అందరికీ పండుగ రోజ. ఈ రోజున స్వేచ్ఛ సమానత్వాలు అందరూ అనుభవించగలుగుతున్నాం అంటే ఆ మహాపురుషుని పుణ్యమే. ఇప్పటికీ నామ మాత్రముగా అణగారిన వర్గాలకు పదవులు ఇచ్చి వారిని నెత్తినెక్కి తొక్కుతున్న పెత్తందారులకు సమాధానం చెబుతూ. అన్యాయంపై తిరగబడిన వారి పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తామని తెలుపుతూ. ఆ పుణ్య మూర్తి జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరపున నివాళులర్పిస్తున్నాం. ప్రతి భారతీయుని గుండెలో అంబేద్కర్ చిరస్మరణీయణం నిలిచి ఉన్నారు అని గర్వంగా తెలుపుతున్నానని కిషోర్ గునుకుల తెలిపారు.