ఫుడ్ పాయిజన్ కు గురైన విద్యార్థులను పరామర్శించిన విడివాడ రామచంద్రరావు

తణుకు నియోజకవర్గం, తణుకు పట్టణంలోని మున్సిపల్ స్కూల్ నందు మధ్యాహ్నం భోజన పథకంలో ఫుడ్ పాయిజన్ కారణంగా సుమారుగా 15 మంది విద్యార్థులు ఆస్వస్థతకు గురై తణుకు గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. విషయం తెలుసుకున్న తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్ర రావు ఆ విద్యార్థులను పరామర్శించి, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, మరియు దీనికి కారణమైన వారిని శిక్షించాలని, వాళ్ళ కాంట్రాక్ట్ రద్దుచేసి అర్హులైన వారికి కాంట్రాక్ట్ అందజేయాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.