ఆత్మకూరు జనసేన కీలక నేతల సమావేశం

ఆత్మకూరు ఆరు మండలాల జనసేన కీలక నేతలు శుక్రవారం సమావేశమయ్యారు. సమావేశంలో భాగంగా ఆత్మకూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతం కోసం భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాలు గురించి చర్చించారు. నియోజకవర్గలో పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసే ప్రతి జనసైనికుడిని కలుపుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు సూరాయపాలేం పవన్, ఏ ఎస్ పేట మండలం జనసేన పార్టీ అధ్యక్షులు సయ్యద్ అక్బర్, ఆత్మకూరు రూరల్ నాయకులు ప్రవీణ్, అనంతసాగర మండలం జనసేన పార్టీ అధ్యక్షులు మహబూబ్ మస్తాన్ బాషా, చేజర్ల మండల నాయకులు శ్రీను, సంగం మండలం నాయకులు ప్రసాద్, మర్రిపాడు మండల నాయకులు చిన్నా జనసేన తదితరులు పాల్గొన్నారు.