షేక్ కరిముల్లా ఆధ్వర్యంలో 300 మంది ముస్లిం పేదలకు రంజాన్ తోఫా
పొన్నూరు నియోజకవర్గం, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు షేక్ కరిముల్లా ఆధ్వర్యంలో 300 మంది ముస్లిం పేద ప్రజలకు రంజాన్ తోఫా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పాల్గొని ముస్లిం సోదరీమణులకు రంజాన్ తోఫా అందజేశారు. అనంతరం గాదె మాట్లాడుతూ… ఎవరికైనా సహాయం చేయాలంటే మనసుండాలి ఈ యొక్క పండగ సందర్భంలో తనకు ఉన్న దానిలో నుంచి ఇతరులకు కొంత సహాయం చేయాలని ఆలోచన చేసిన పట్టణ అధ్యక్షుడు కరీముల్లాకి దేవుడు మరింత శక్తిని ఇచ్చి రానున్న రోజుల్లో ఎక్కువ మందికి సహాయం చేసే శక్తిని ఆ అల్లా ప్రసాదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా, నాయకులు, పొన్నూరు నియోజకవర్గ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-15-at-14.53.57-1-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-15-at-14.53.57-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-15-at-14.53.58-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/04/WhatsApp-Image-2023-04-15-at-14.53.54-768x1024.jpeg)