మంత్రి కొడాలి నానిపై పవన్ కామెంట్స్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లా గుడివాడలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో పవన్ చాలా రోజుల తర్వాత వైసీపీ నేతలపై ఘాటైన విమర్శలు చేశారు. గుడివాడ రాగానే మంత్రి కొడాలి నానిపై పంచ్‌లు వేశారు. పేకాట క్లబ్‌లపై ఉన్న శ్రద్ధ రోడ్లు బాగుచేయడంలో లేదని విమర్శించారు. గుడివాడలో రోడ్లు అధ్వన్నంగా ఉన్నాయని ప్రజలు రహదారులను బాగుచేయాలని ఎమ్మెల్యేను నిలదీయాలన్నారు చాలా  రోజుల తర్వాత పవన్ హాట్ హాట్ కామెంట్స్ చేయటంతో రాజకీయంగా హీట్ పెరిగింది.

నోటి దురుసు చూపించే ఎమ్మెల్యేలను జనసేన బలంగా ఎదుర్కొంటుందని ఒక వర్గానికి చెందిన మీడియా సంస్థల్లో ఇష్టమొచ్చినట్లు దురుసుగా మాట్లాడితే కుదరదని పవన్ హెచ్చరించారు. ప్రజలను భయపెట్టి పాలిద్దామంటే భరించడానికి ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేరన్నారు. 175మందిలో 151 ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఇంత చెత్త రోడ్లు ఇస్తారా అంటూ అని ప్రశ్నించారు. రోడ్లు అస్తవ్యస్థంగా ఉన్నాయన్నారు. మార్పు రావాలని, అందరికీ న్యాయం జరగాలన్నారు. తన అంతిమ శ్వాస ఉన్నంతవరకు ప్రజలకు అండగా ఉంటానని పవన్ స్పష్టం చేశారు.