వీరమహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి బేషరతుగా క్షమాపణలు చెప్పాలి: మందపాటి దుర్గారావు

సత్తెనపల్లి: గౌరవ మంత్రి వర్యులు అంబటి రాంబాబు ఆయన నియోజకవర్గంలో జరిగిన ఒక కార్యక్రమంలో జనసేన వీరమహిళలను, జనసైనికులను ఉద్దేశించి వారిని అవమానించేలా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తూ తక్షణమే బేషరతుగా వారికి క్షమాపణలు చెప్పాలని దాచేపల్లి మండల జనసేన పార్టీ అధ్యక్షులు మందపాటి దుర్గారావు డిమాండ్ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంట అరగంట షోలు చేసుకుని జగన్మోహన్ రెడ్డి కింద ఊడిగం చేసుకుంటూ బ్రతికే నీకు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ మా వీరమహిళల గురించి గాని మాట్లాడే నైతిక అర్హత లేదని మరొక్కమారు మా వీరమహిళలు, జనసైనికుల గురించి మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు కాపు కులాన్ని తాకట్టు పెడుతున్నారని అంటున్న మీ వ్యాఖ్యల్ని 2024లో మీకు అధికారం రాదని ఓటమి తధ్యమని తెలిసి మీకు మతి భ్రమించి మాట్లాడుతున్న మాటలుగానే మేము భావిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు అన్నికులాలకు, భావితరాలకు న్యాయం చేయడం కోసం వచ్చిన వ్యక్తి అటువంటి వారిని మీ రాజకీయ భవిష్యత్తు కోసం ఒక్క కులానికి పరిమితం చేయాలనే మీ తపన చూస్తుంటే మీ కుచిలత్వం ప్రజలందరికీ అర్ధం అవుతుంది. కాపులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు కులాన్ని ఉద్ధరించినట్లు మాట్లాడుతున్న మీరు అసలు కాపు కులం కోసం ఏంచేశారో చెప్పి మాట్లాడాలి అధికారంలోకి రాగానే కాపు కార్పోరేషన్ని తీసివేసినప్పుడు మీకు కులం ఎందుకు గుర్తుకు రాలేదని అడుగుతున్నాం. ప్రతి సారి పవన్ కళ్యాణ్ గారి గురించి ప్యాకేజి అని మాట్లాడే మీకు ప్రతి గ్రామంలో ఎప్పుడు మొరుగుదమా అని చూస్తూఉండే గ్రామ సింహానికి పెద్ద తేడా లేదని మీ నియోజకవర్గ ప్రజలందరి భావన. మీరు ఇలాగే జగన్ రెడ్డి దగ్గర విశ్వాసం చూపించడం కోసం ఆధారాలు లేని మాటలు అవమానకరమైన మాటలు మాట్లాడితే సత్తెనపల్లి నియోజకవర్గంలో వీరమహిళతో పాటు రాష్ట్రంలోని వీరమహిళలందరు మీరు ఎక్కడ కనపడిన చీపుర్లతో మీ బుర్రకు పట్టిన బూజుని దులిపి పంపిస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఈ సందర్బంలో తెలియచేస్తూన్నాం. మంత్రి గా ఉన్న మీరు పవన్ కళ్యాణ్ గారిని తిట్టడంపై పెట్టే దృష్టి పోలవరం పూర్తిచేయడంపై పెట్టి ఉంటే ఇప్పటికే పోలవరం పూర్తయ్యేదని గుర్తుంచుకోండి. మరొక్కసారి మీ రాజకీయ భవిష్యత్తు కోసం జగన్ రెడ్డి దగ్గర విశ్వాసం చూపించడం కోసం మా నాయకుని గాని మా వీరమహిళల్ని, జనసైనికులపై నోటికి వచ్చినట్లు మాట్లాడితే మీ పాలనలో పూర్తి చేయలేని పోలవరంలో కలిపి రాష్ట్ర ప్రజలకు వైసిపి విముక్త ఆంధ్రప్రదేశ్ ని అందిస్తామని తెలియచేస్తూన్నామని మందపాటి దుర్గారావు అన్నారు.