జనసేన ప్రజా చైతన్య యాత్ర 16వ రోజు

బొబ్బిలి నియోజకవర్గం, తెర్లం మండలంలో ఉన్న చిన్న శివడ వలస గ్రామం, బొబ్బిలి మండలం శివడ వలస గ్రామంలో స్థానిక జనసైనికులు ఆహ్వానం మేరకు జనసేన ప్రజా చైతన్య యాత్రలో భాగంగా 16వ రోజు బొబ్బిలి నియోజకవర్గం ఇంచార్జ్ అప్పలస్వామి గారు పర్యటించడం జరిగింది. ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకొని సమస్యలు పరిష్కారానికై తగు కార్యచరణ రూపొందించడం జరిగింది. చిన్న శివడ వలస ప్రధాన సమస్య రోడ్డు అనేది గుర్తించడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే గాని మండల నాయకులు గాని మారుమూల ప్రాంతం అయినందున ఈ గ్రామాన్ని పట్టించుకోవడం లేదు ఇంతవరకు కూడా ఎవరు కూడా వెళ్లలేదు. మంగళవారం బొబ్బిలి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ అప్పలస్వామి గ్రామాన్ని పర్యటించి ప్రధాన సమస్య రోడ్డు అని తెలుసుకొని ఆ రోడ్డు యొక్క సమస్యను గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికై కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.