తాడేపల్లిగూడెం జనసేన పట్టణ నాయకులు, కార్యకర్తల అత్యవసర భేటీ

తాడేపల్లిగూడెం జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు వర్తనపల్లి కాశీ అధ్యక్షతన తాడేపల్లిగూడెం వార్డు మెంబర్లు మరియు పట్టణ కమిటీ మెంబర్లతో అత్యవసర భేటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బొలిశెట్టి శ్రీనివాస్ మరియు వారి తనయులు బొలిశెట్టి రాజేష్ విచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేన పార్టీలో కొత్తగా ఎన్నికైన పట్టణ వార్డు ఇన్చార్జులకు వార్డ్ మెంబర్లకు మరియు నాయకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ ఓడిపోయిన ఈ నాలుగు సంవత్సరాలు నా వెన్నంటే ఉన్నవారందరికి ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి వార్డులో ఉన్న సమస్యలను తెలుసుకుని వాటిని తీర్చే విధంగా తగు చర్యలు తీసుకొని తాడేపల్లిగూడెం వార్డ్ మెంబర్లతో మరియు ఇంచార్జ్ లతో నాయకులతో ప్రజల వద్దకు వచ్చే ఎన్నికలలో ప్రతి ఇంటికి వెళ్లి జనసేన చేసే మంచి కార్యక్రమాలను వివరించి వచ్చే ఎన్నికల్లో ముందుకు సాగాలని వివరించారు. ఈ కార్యక్రమంలో వర్తనపల్లి కాశీ, పైబోయిన వెంకటరామయ్య, అడబాల నారాయణమూర్తి, కేశవభట్ల విజయ్, గుండు మోగుల సురేష్, మాదాసు ఇందు, అడపా ప్రసాదు, పుల్లా బాబి, చెరుకూరి పండు, మట్ట రామకృష్ణ, మద్దాల మణికుమార్, నల్లకంచు రాంబాబు, బయనపాలేపు ముఖేష్, గరగ బాలాజీ, సోమరాజు, లింగం శ్రీను, వీరమహిళలు, కసిరెడ్డి మధులత, వెజ్జు రత్న కుమారి, దేవ జ్యోతి, చాంద్ బేబి, సామినేని సత్యవతి, తల్లాది మధుమతి, కందుల విజయ, కటికిరెడ్డి కళ్యాణి మరియు తదితరులు పాల్గొన్నారు.