చందుపట్ల కీర్తి రెడ్డిని గెలిపించాలని జేరిపోతుల ఇంటింటా ప్రచారం

తెలంగాణ, భూపాలపల్లి: భూపాలపల్లి నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి చందుపట్ల కీర్తి రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని జనసేన పార్టీ జిల్లా సీనియర్ నాయకులు జేరిపోతుల సనత్ కుమార్ ఇంటింటా ప్రచారం నిర్వహించడం జరిగింది. జనసేన పార్టీ భూపాలపల్లి జయశంకర్ జిల్లా సీనియర్ నాయకులు జేరిపోతుల సనత్ కుమార్ ఆధ్వర్యంలో అంబేద్కర్ కు పూలమాలేసి బిజెపి జనసేన ఇంటింటి ప్రచారంలో భాగంగా బట్టు రవి, బిజెపి రాష్ట్రఎస్సీ మోర్చా నాయకులు అదే విధంగా ఇన్చార్జిలు ఆకుమర్తి బేబీ రాణి, మహిళా మోర్చా స్టేట్ సెక్రటరీ కట్ట పద్మ, మహిళా మోర్చా ఇన్చార్జి ఉత్తరాంధ్ర జోన్ భూత అధ్యక్షులు ఎస్సీ మోర్చా జనరల్ సెక్రెటరీ జనసేన పార్టీ ఘనపురం మండల నాయకులు పైడిమల్ల రాజు, నీలాల రమేష్, మల్లేష్, భద్రయ్య, రవి, రమేష్, మహిళలు కమలం పువ్వుకు ఓటు వేసి భారీ మెజార్టీతో ఎమ్మెల్యే అభ్యర్థి కీర్తి రెడ్డిని గెలిపించాలని ఇంటింటికి కోరడం జరిగింది.