కిమ్స్ లో పలువురిని పరామర్శించిన పితాని

ముమ్మిడివరం: జనసేన పార్టీ పిఏసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఆదివారం అమలాపురం కిమ్స్ హాస్పిటల్ నందు చికిత్సపొందుతున్న ముమ్మిడివరం మండలం గేదెల్లంక గ్రామానికి చెందిన పితాని బాల సత్యనారాయణ (చిరంజీవి), ఐనాపురం గ్రామానికి చెందిన దునబోయిన రామకృష్ణ, కాట్రేనికోన మండలం వేట్లపాలెం గ్రామానికి చెందిన కడలి సత్యనారాయణ, చిర్రయానం గ్రామానికి చెందిన పాలెపు లక్ష్మణస్వామి, చెయ్యేరు జల్లగుంట గ్రామానికి చెందిన పెండెం శ్రీనివాసరావులను పరామర్శించారు. వీరి వెంట సానబోయిన వీరభద్రరావు, కొప్పిశెట్టి రాంబాబు, గుత్తుల శ్రీనివాస్ మొదలగువారు ఉన్నారు.