అమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో జనసేన కార్యకర్తలకు ఘన సన్మానం

రాజమండ్రి: జనసేన పార్టీ తరపున బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతోమందికి బ్లడ్ అందిస్తూ అందరికీ తమ వంతు సేవ చేసుకుంటూ శాటిలైట్ సిటీ గ్రామంలో “సి” బ్లాక్ ఇల్లు కాలిపోయిన వారికి ఇల్లు కట్టించి మరియు “బి” బ్లాక్ లో ఇల్లు కాలిపోయిన వారికి ఆర్థిక సాయం మొదలగు సేవా కార్యక్రమాలు చేస్తున్న జనసేన పార్టీ రూరల్ మండల ప్రధాన కార్యదర్శి చౌడాడ సునీల్, మండల కార్యదర్శి దీప్తి మహంతి సుబ్బారావు, జనసేన శాటిలైట్ సిటీ గ్రామ అధ్యక్షులు గొడిసిపూడి నాగేంద్ర, ఉపాధ్యక్షులు పీతల సూరిబాబు, ఉపాధ్యక్షులు పోలూరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఎలుగుబంటి దుర్గారావు, ప్రధాన కార్యదర్శి పాలవలస గోపి, ప్రధాన కార్యదర్శి అన్యం వెంకట సుబ్రహ్మణ్యం, కార్యదర్శి రెడ్డి కరుణ, కార్యదర్శి శీలం సురేష్ కుమార్, సంయుక్త కార్యదర్శి కాజా శివరామకృష్ణ, యూత్ ప్రెసిడెంట్ బోర అప్పలనాయుడు, చుక్క గౌరు నాయుడులను వారు చేస్తున్న సేవా కార్యక్రమాలకు గానూ అమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో ఏ.పి.జె అబ్దుల్ కలాం సొసైటీ అవార్డ్స్ వారు సన్మానం చేసి, అభినందన పత్రాలను అందజేసారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ మాకు ఈ గౌరవం ఇస్తున్నందుకు “అమ్మ సేవా సమితి” ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు శ్రీ వై శ్రీనివాస్ గారికి రాజమండ్రి నగర ప్రధాన కార్యదర్శి భాష లిమ్రా గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు.