జనసేన నాయకులకు ఆత్మీయ సన్మానం

గుంటూరు: ఉమ్మడి గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయానికి బుధవారం జనసేన పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఈమని ప్రతాప్, జనసేన పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ విజయ్ కుమార్ మరియు లీగల్ సెల్ జెనరల్ సెక్రటరీ కప్పెర కోటేశ్వరరావులు విచ్చేసారు. వారిని జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ఆత్మీయంగా సన్మానించడం జరిగింది. అనంతరం పార్టీ కార్యక్రమాలపై చర్చించడమైనది. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.