గరికపాటి వెంకట్ ఆధ్వర్యంలో ఎడ్ల బల ప్రదర్శన

  • 9వ తారీఖున జరిగిన సీనియర్ క్యాటగిరీ విభాగంలో 17 జతలు పాల్గొన్నవి

దర్శి నియోజకవర్గం: దర్శిలో జనసేన నాయకులు గరికపాటి వెంకట్ ఆధ్వర్యంలో 4వ రోజు జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన సోమవారం ప్రారంభమయ్యాయి. న్యూ కేటగిరీ విభాగంలో మొత్తం 17 జతలు పాల్గొనవి. ఈ పోటీలను దర్శి జనసేన నాయకులు గరికపాటి వెంకట్, ఇంచార్జ్ బోటుకు రమేష్ ప్రారంభించారు, ప్రజలతోటి ఎడ్ల పోటీలను తిలకించారు. దర్శి రోడ్డులో భారీ స్వాగత దొరణాలు ఏర్పాటు చేశారు. అదేవిదంగా నియోజకవర్గం పరిధిలోని ఎడ్ల బల ప్రదర్శను తిలకించడానికి వచ్చే ప్రేక్షకులు కు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశారు. ప్రాంగణంలో భారీ ఎల్. ఈ డి స్క్రీన్ లును ఏర్పాటు చేశారు. నియోజకవర్గంతో పాటు పలు జిల్లాలు నుండి పోటీలను తిలకించేందుకు రైతన్న లు వచ్చారు. ప్రాంగణం అంత టిడిపి, జనసేన, ఫ్లెక్సీ లు, జండాలు ను ఎర్పాటు చేశారు. పోటీలను తిలకించేందుకు మహిళాలు పెద్ద ఎత్తున్న తరలివచ్చారు. పోటీలను తిలకించిటానికి వచ్చిన మహిళా లకు ప్రత్యేక గ్యాలరీ ని ఏర్పాటు చేశారు. దర్శికి వారం రోజులు ముందే సంక్రాంతి పండుగ వచ్చిందని అన్నదాతలు అంటున్నారు.