తెలుగుదేశం జనసేన పార్టీల ఆత్మీయ సమావేశం

అరకు నియోజకవర్గం: తెలుగుదేశం జనసేన పార్టీల ఆధ్వర్యంలో
సోమవారం జరిగిన ఆత్మీయ సమావేశంలో మాట్లాడుతున్న జనసేన పార్టీ మండల అధ్యక్షులు చిట్టం మురళి మాట్లాడుతూ 2024 అసెంబ్లీ ఎన్నికలో పోత్తులో భాగంగా ప్రతి గ్రామాల్లో ప్రతి గడపగడపకు తెలుగుదేశం పార్టీ జనసైనికులు కలిసి ప్రచారం చేయాలని ప్రభుత్వం ఆవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రజలు అనేక విధాలుగా నష్టపోతున్నారని ప్రజలకు వివరించాలని ఈ సమావేశంలో ఆయన తెలిపారు. అలాగే 2024 అసెంబ్లీ ఎన్నికలో పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసికట్టుగా పనిచేసి గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బుజ్జిబాబు, ప్రధాన కార్యదర్శి ఆనంద్, జిల్లా కార్యవర్గ సభ్యులు జోగులు, ఉపాధ్యక్షులు దోను, మాజీ ఎంపిటిసీ దయనిది, జగన్, శివ, జానకి, కృష్ణ, చందర్రావు సుందర్, చిరంజీవి, జనసేన పార్టీ ముఖ్య నాయకులు సుధాకర్, నవీన్, ప్రవీణ్, చంటి, వీరమహిళ రత్నప్రియ తదితరులు నాయకులు పాల్గొన్నారు.