ఆటోలో నవజాత శిశువుకు జన్మనిచ్చిన గిరిజన మహిళ

పాడేరు నియోజకవర్గం: అల్లూరి సీతారామరాజు జిల్లా, హుకుంపేట మండల పరిధిలో సల్తంగి గ్రామానికి చెందిన ఆదివాసి గిరిజన మహిళ రాప సుశీల ఆటోలోనే నవజాత శిశువుకు జన్మనిచ్చింది. సల్తంగి గ్రామానికి చెందినరాపకు సుశీల గురువారం ప్రసవ నొప్పులు రావడంతో గవర్నమెంట్ అంబులెన్స్ 108 కి ఫోన్ చేసినా అంబులెన్స్ రాలేకపోవటంతో ఆటోలో ఆస్పత్రికి తరలించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అరకు వేలి నుంచి చోంపి వెళ్లే రూటు బాలేని పరిస్థితిలో ఉండటం వల్ల సుశీల ఆటోలోనే నవజాత శిశువుకు జన్మనిచ్చింది. అదే సమయంలో హుకుంపేట మండల జనసైనికులు, జనసేన నాయకులు మజ్జి కృష్ణంరాజు 108 ను పిలిపించి అరకు వేలి ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది.