కరోనాను జయించిన అభిషేక్ బచ్చన్

కొన్ని రోజుల క్రితం అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ బచ్చన్ మరియు ఆరాధ్య బచ్చన్ కరోనా బారినపడిన విషయం తెలిసిందే. ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొంది ముందుగా, ఐశ్వర్య రాయ్ మరియు ఆమె కూతురు ఆరాధ్య కరోనాను జయించగా, ఇటీవలె అమితాబ్ బచ్చన్ కూడా కరోనాను జయించారు.

కాని, అభిషేక్ బచ్చన్ మాత్రం కరోనాతో పోరాడుతూనే ఉన్నారు. దాంతో యావత్ సినీ లోకం అభిషేక్ బచ్చన్ కరోనాను జయించాలని ప్రార్థనలు చేశారు. అయితే వారి ప్రార్థనలకు ఫలితంగా అభిషేక్ బచ్చన్ ఈరోజు మధ్యాహ్నం కరోనాను జయించారు. ఈ విషయాన్ని అభిషేక్ బచ్చన్, స్వయంగా ట్విట్టర్ వేదిక తెలియజేశారు. మీ అందరికీ మాటిచ్చాను కదా, నేను కరోనాను జయిస్తాను అని.. ఈరోజు మధ్యాహ్నం నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షలో నాకు నెగిటివ్ అని రిపోర్ట్ వచ్చింది అని అభిషేక్ బచ్చన్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా, తన కోసం తన కుటుంబం కోసం ప్రార్థన చేసిన అందరికీ ధన్యవాదాలు. అలాగే, నానావతి ఆసుపత్రి వైద్యులకు, సిబ్బందులకు ఎప్పటికి రుణపడి ఉంటాను అని అభిషేక్ బచ్చన్ అన్నారు.