ఘనంగా క్రియాశీలక కార్యకర్తల ప్రమాద బీమా కిట్లు పంపిణీ కార్యక్రమం

భామిని మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో.. బిల్లమడ గ్రామం వేదికగా.. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ మరియు క్రియాశీలక కార్యకర్తల ప్రమాద భీమా కిట్లు పంపిణీ కార్యక్రమం లాంచనంగా ప్రారంభించారు. భామిని మండల జనసేన పార్టీ నాయకులు కిరణ్, కిషోర్, మహేష్ ఆధ్యర్యంలో.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జనసేన పార్టీ పాలకొండ నియోజకవర్గం నుంచి గార్బన సత్తిబాబు, పొట్నూరు రమేష్, మన్మదరావు, ప్రసాంత్ విచ్చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ కోసం కష్టపడే ప్రతిఒక్క కార్యకర్తకి పవన్ కళ్యణ్ గారు భరోసాగా ఉంటారని పార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు వై.వినోద్, యమ్.అనిల్, పోలినాయుడు, మనోజ్, బి.నాగేశ్వరరావు మరియు జనసైనికులు పాల్గొన్నారు.