క్రియాశీలక సభ్యత్వ నమోదు అవగానా కార్యక్రమం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సుజాతనగర్, కొత్తగూడెం రైల్వే స్టేషన్ దగ్గర.. క్రియాశీలక సభ్యత్వ నమోదు అవగానా కార్యక్రమంలో భాగంగా ఆటో డ్రైవర్లకు దేవా గౌడ్ ప్రసాద్ క్రియాశీలక సభ్యత్వం గురించి తెలియజేసి.. ఇది మీ కుటుంబానికి ఇస్తున్న జనసేన భరోసా, 500 రూపాయలు పెట్టి సభ్యత్వం తీసుకుంటే మీ కుటుంబానికి ఎంతో మేలు కలుగుతుందని.. ఆపత్కాలంలో కార్యకర్తలకు అండగా జనసేన నిలుస్తుందని, జనంలో చైతన్యం రావాలని జనంలోకి వెళ్లి.. క్రియాశీలక సభ్యత్వం గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేవా గౌడ్ ప్రసాద్, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.