దోమకొండ అశోక్ ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం

విజయవాడ సెంట్రల్: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు సూచనల మేరకు క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ యువ నాయకులు దోమకొండ అశోక్ ఆధ్వర్యంలో 7వ డివిజన్ లో ఏర్పాటు చేసిన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 7వ డివిజన్ లో గడప గడపకు పర్యటించిన వాసు ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజా సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అమ్మిశెట్టి వాసు మాట్లాడుతూ.. దేశంలోనే ఏ రాజకీయ పార్టీ ఇవ్వని విధంగా, జనసేన పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు మరియు వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇస్తూ, వారి కుటుంబ సభ్యులకు పెద్దన్నలా నిలబడుతున్న జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి 2024లో ఒక అవకాశం ఇవ్వాలని, జనసేన పార్టీకి మీ ఆశీస్సులు కావాలని, క్రియాశీలక సభ్యత్వం తీసుకుని జనసేన పార్టీలో భాగస్వాములు కావాలని ప్రజలను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో 7వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి దోమకొండ మేరీ, ఉపాధ్యక్షులు పెళ్లూరి ఉమామహేశ్వరరావు, సాదిరెడ్డి శ్రీను, బండి ప్రదీప్, పెందుర్తి విజయ్ కుమార్, భాస్కర్, సాయి మోహన్, సాయి బ్రహ్మాజీ, మరియు జనసేన పార్టీ 7వ డివిజన్ నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.