శరవేగంగా షూటింగ్ జరుపనున్న ఆదిపురుష్ టీమ్.. ముంబై లో భారీ సెట్టింగ్

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్నాడు. భారీ సినిమాలను లైన్ లో పెట్టిన డార్లింగ్ ఆ సినిమాలను ఒకదాని వెంట ఒకటి పూర్తి చేస్తున్నాడు. ఇప్పటికే వీటిలో రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న రాధేశ్యామ్ సినిమా షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. మరికొద్ది రోజులు చిత్రీకరణ జరిపితే ఈ సినిమా పూర్తవుతుంది. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సలార్ అనే టైటిల్ తో తెరకెక్కుతుంది. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమా రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతోందని అంటున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడని అంటున్నారు. ఆదిపురుష్ షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడ్డ విషయం తెల్సిందే. లేదంటే ఇప్పటి వరకు షూటింగ్ ను హైదరాబాద్ లో ప్రారంభించే వారు. హైదరాబాద్ లో సుదీర్ఘ షెడ్యూల్ తో సినిమా మెజార్టీ షూటింగ్ పూర్తి చేయాలనుకున్నారు. కానీ కరోనా అడ్డుపడింది.