అలిపిరి టోల్గేట్ ఛార్జీలు పెంపు
తిరుపతి(చిత్తూరు): అలిపిరి టోల్గేట్ ఛార్జీలను పెంచుతూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం కారుకు రూ.15 నుండి రూ.50, మినీ బస్సు, మినీ లారీకి రూ.50 నుండి రూ.100కు పెరగనుంది. ఇక లారీ, బస్సుకు ప్రస్తుతం ఉన్న టోల్ రుసుమును రూ.100 నుండి రూ.200కు పెంచింది. గతేడాది మార్చిలోనే టోల్ఛార్జీలను పెంచుతూ టిటిడి బోర్డు తీర్మానం చేసింది. ఈమేరకు తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.దీంతో తిరుపతి వెంకన్న వద్దకు వెళ్లేవారిపై టోల్బాదుడు మోగనుంది.