ఆల్ ఇంగ్లండ్ టోర్నీ.. సింధు స్టన్నింగ్ విక్టరీ
పివి సింధు స్టన్నింగ్ విక్టరీ కొట్టింది. ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ టోర్నీ క్వార్టర్స్లో సూపర్ విజయాన్ని నమోదు చేసింది. జపాన్ క్రీడాకారిణి యమగుచితో జరిగిన మ్యాచ్లో అద్భుత రీతిలో ఆటను ప్రదర్శించింది. రసవత్తరంగా సాగిన క్వార్టర్స్లో 16-21, 21-16, 21-19 స్కోర్తో మ్యాచ్ను కైవసం చేసుకుంది. యమగుచితో ఆడిన చివరి మూడు మ్యాచ్ల్లో సింధు ఓటమిపాలైంది. ఈ సారి సింధుపై యమగుచి నాలుగో విజయం సాధించడం ఖాయమే అన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. తొలి గేమ్ను యమగుచి గెలవడంతో ఆ డౌట్స్ మరింత బలపడ్డాయి. కానీ సింధు మాత్రం తన పూర్తి సత్తాను ప్రదర్శించింది. మూడో నిర్ణయాత్మక గేమ్లో.. ఇద్దరూ భారీ ర్యాలీలతో హోరెత్తించారు. డిసైడర్ గేమ్లో సింధు కీలక దశలో అసామాన్య ఆటను కనబరిచింది. నువ్వా.. నేనా అన్నట్లుగా సాగిన ఆ గేమ్ను 21-19తో గెలుచుకున్నది.