గ్రామ సభలు గురించి ప్రజలందరికీ సమాచారం ఇవ్వాలి

పూసపాటిరేగ మండల జనసేన నాయకులు స్థానిక ఎంపీడీఓని కలిసి గతంలో గ్రామ సభలను గురించి ప్రజలకు కనీస ముందస్తు సమాచారం ఉండటం లేదని, ఇకపై ఆ పరిస్థితి పునరావృతం కాకుండా సంబందిత అధికారులను హెచ్చరించాలని కోరడం జరిగింది. మండలం మొత్తం గ్రామ సభలు జరగబోయే తేదీ వివరాలను అడిగి తెలుసుకున్నారు.స్థానిక ఈఓ & పి.ఆర్.డి మాట్లాడుతూ గ్రామ సభలను గురించి ముందస్తు సమాచారం అందరికీ తెలిసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పూసపాటిరేగ మండల అధ్యక్షుడు జలపారి అప్పడుదొర, మత్స్యకార విభాగ కార్యదర్శి కారి అప్పలరాజు సీనియర్ నాయకులు బూర్లె విజయశంకర్, మాదేటి ఈశ్వర్రావు, దుక్క అప్పలరాజు, ఎస్.మార్ట్ రమేష్, పిన్నింటి ప్రమోద్, చింతపల్లి వెంకటేష్, అల్లాడ జగదీష్, జలపారి నాగరాజు తదితర జనసైనికులు పాల్గొన్నారు.