జనసేన డిజిటల్ క్యాంపెయిన్ లో అమలాపురం జనసేన

అమలాపురం, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను పార్లమెంట్లో వ్యతిరేకించాలని అమలాపురం ఎంపీ శ్రీమతి చింతా అనురాధని కోరుతూ పట్టణ అధ్యక్షులు పిండి సాయిబాబా ఆధ్వర్యంలో జనసేనపార్టీ అమలాపురం ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి అంబేద్కర్ విగ్రహం వద్ద మరియు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట పట్టణ అధ్యక్షులు ప్లకార్డ్స్ తో కూడిన డిజిటల్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.