సత్తెనపల్లి నియోజకవర్గ జనసేనపార్టీ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

సత్తెనపల్లి, ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డా: బాబాసాహెబ్ అంబేద్కర్ 131వ జయంతి ఉత్సవాలను సత్తెనపల్లి జనసేన పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ముందుగా ముప్పాళ్ళ మండలం మాదల గ్రామంలో ఎస్సీ కాలనీ నందు గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో అలంకరించి నివాళులు అర్పించారు. తరువాత సత్తెనపల్లి లోని జనసేన పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలతో సత్కరించి పార్టీ శ్రేణులు ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం పట్టణంలోని తాలూకా సెంటర్లో గల విగ్రహం వద్దకు ర్యాలీగా వెళ్లి విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు తెలియజేశారు. ఆ తరువాత రూరల్ మండలం దూళిపాళ్ళ గ్రామం, రాజుపాలెం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మరియు అనుపాలెం గ్రామం ప్రధాన రహదారిపై ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద, మరియు నకరికల్లు మండల కేంద్రంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు అలంకరించి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమాలను పార్టీ నియోజకవర్గ కార్యాలయ ఇంచార్జ్ సిరిగిరి మణికంఠ పర్యవేక్షించగా పార్టీ జిల్లా అధికార ప్రతినిధి తవిటి భావనారాయణ, జిల్లా సంయుక్త కార్యదర్శులు సిరిగిరి శ్రీనివాసరావు, అంపిరాయని రాజేశ్వరి, నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల అధ్యక్షులు తోట నరసయ్య, నాదెళ్ల నాగేశ్వరరావు, సిరిగిరి పవన్ కుమార్, తాడువాయి లక్ష్మి, సత్తెనపల్లి మున్సిపల్ కౌన్సిలర్ రంగిశెట్టి సుమన్, ప్రోగ్రామ్స్ కమిటీ సభ్యులు బత్తుల కేశవ, వీరమహిళలు మాలెంపాటి సౌజన్య, నామా పుష్పలత, గట్టు శ్రీదేవి, తిరుమలశెట్టి మల్లీశ్వరి, పార్టీ నాయకులు సోమిసెట్టి సుబ్రహ్మణ్యం, తోట శ్రీను, అంచుల ఆంజనేయులు, సిసింద్రీ, అంచుల అనేష్, కేదారి రమేష్, బత్తిన శ్రీను, ఎస్.కె రఫీ, నాగుర్ వలి, అడబాల ధర్మ, చిలకా కోటేశ్వర రావు, గాడిదపాటి అనిల్, పోతంసెట్టి వెంకటేష్, గలబా నాగేశ్వరరావు, కాసా రామకృష్ణ, పానాది హర్ష, తిరుమలశెట్టి సాంబశివ, మాదల శేషు, రామిశెట్టి సందీప్, ఎస్.కె చిట్యాల షఫీ, తోట నాగేశ్వరరావు, తిరుమల సాంబ, రుసుం వెంకటేష్, ఎస్.కె శ్రీనుబాషా తదితరులు పాల్గొన్నారు.