నరసరావుపేట జనసేన ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

నరసరావుపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో సయ్యద్ జిలాని నాయకత్వంలో. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా జిలాని మాట్లాడుతూ.. విభిన్న జాతులు విభిన్న మతాలు కలిగిన భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారు మహనీయులను ఇన్నేళ్లు గడిచినా.. వారిని కొనియాడుతూనే ఈ దేశం ముందుకు పోతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జి ఎస్ ప్రసాద్, అద్దెపల్లి ఆనంద్ బాబు, ఈశ్వర్, ఆర్ కే యాదవ్, దుర్గా కుమారి, అబ్దుల్ రవూఫ్, మేడిశెట్టి రామారావు, గుప్తా శ్రీకాంత్, షేక్ మౌలాలి, వెంకటేశ్వర్లు, మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.