అనకాపల్లి వీర మహిళలకు ఘన సత్కారం

అనకాపల్లి, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అనకాపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ పరుచూరి భాస్కరరావు ఆదేశాల మేరకు అనకాపల్లి జనసేన పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ఉన్న పలువురు క్రియాశీలక వీరమహిళలను దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసి మొక్కలు అందజేశారు. సృష్టిలో సగ భాగం మహిళ అని, ప్రతీ మనిషి జీవితంలో కీలకపాత్ర పోషించే ఆడపడుచులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇలా సత్కరించుకోవడం తమ బాధ్యత అని అన్నారు. సంపూర్ణ స్త్రీ సాధికారత జనసేనతో మాత్రమే సాకారం అవుతుందని అన్నారు. ప్రతి మహిళా తమ తమ రంగాలలో ఉన్నతమైన స్థాయిలో ఉండాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. అనకాపల్లి మండలం, టౌన్ లలో పలువురు వీర మహిళలను సత్కరించి, అనంతరం కశింకోట మండలంలో మండల నాయకులు పావాడ కామరాజు పెద్ద కోడలు, మండలంలో పార్టీ కార్యక్రమాలలో మొదటి నుండి చురుకుగా పాల్గొనే జమాదులపాలెం గ్రామానికి చెందిన జనసేన వీర మహిళ శనివాడ లక్ష్మిని కలిసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మంగా ఈశ్వర్, పావాడ కామరాజు, కర్రి గోవింద్, కలగ శ్రీనివాసరావు (ఎస్.ఆర్.కె), గూడెపు మణికంఠ, కరణం శివకుమార్, కాసిందేవు వెంకట అప్పారావు (అఖిల్ శ్రీను), గూడుపు చిన్నారావు, గొన్నా చంటి తదితరులు పాల్గొన్నారు.