ఆంధ్రా అభివృద్ధి – జనసేనతోనే సాధ్యం 25వ రోజు

సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, తాళ్లపూడి గ్రామంలో ఆంధ్రా అభివృద్ధి – జనసేన తోనే సాధ్యం 25వ రోజు కార్యక్రమాన్ని జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యదర్శి, ముత్తుకూరు మండల అధ్యక్షుడు మనుబోలు గణపతి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ముత్తుకూరు మండలంలోని తాళ్ళపూడి గ్రామంలో జనసేన పార్టీ కరపత్రాలు పంచుతూ, మనుబోలు గణపతి మాట్లాడుతూ జనసేన పార్టీ అధికారంలోకి వస్తే యువతకి ఉపాధి లభిస్తుందని, పవన్ కళ్యాణ్ అధికారంలో లేకపోయినా రాష్ట్రంలో చనిపోయిన 3000 మంది కౌలు రైతుల కుటుంబాలకు తన సొంత సంపాదన నుంచి ఆర్థిక సాయం అందించి ఆ కుటుంబాలను ఆదుకున్న మంచి మనసున్న వ్యక్తి. అలాంటి వ్యక్తికి అధికారం ఇస్తే రాష్ట్రానికి చాలా మేలు జరుగుతుందని, రైతులకు లాభసాటి ధరని అందిస్తాడని, ఆంధ్రా అభివృద్ధి జనసేనతోనే సాధ్యమవుతుందని, రాబోవు సాధారణ ఎన్నికలలో జనసేన పార్టీ గుర్తు గాజుగ్లాసు కు ఓటు వేసి జనసేన పార్టీకి అధికారం ఇవ్వండి అంటూ ఇంటింటికి ప్రచార కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తాండ్ర శ్రీను, అన్నిమేటి వెంకయ్య పాల్గొన్నారు.