ప్రపంచ అటవీ దినోత్సవాన్ని నిర్వహించిన అంజనీ పుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్
విజయనగరం: అంజనీ పుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా మంగళవారం ఉదయం అయ్యన్నపేట మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ పాఠశాలలో విద్యార్థులకు అటవీ దినోత్సవంపై అవగాహన కార్యక్రమాన్ని జనసేన పార్టీ సీనియర్ నాయకులు, వాకర్స్ క్లబ్ వ్యవస్థాపకధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు) నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డిస్ట్రిక్ట్-102 గవర్నర్ కర్రోతు సత్యం మాట్లాడుతూ ప్రపంచంలో జీవకోటికి ఆశ్రయమిచ్చేది అడవులని, అడవులే మనకు రక్షని, అడవులను కాపాడుకుంటే మానవాళికి జీవితాన్నిస్థాయిని, అందుకే ప్రతీ ఒక్కరూ మొక్కలునాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రధాన కార్యదర్శి కోయ్యాన లక్ష్మణ్ యాదవ్, సహా కార్యదర్శి కందివలస సురేష్, జాళీ వాకర్ పత్రి సాయి పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-21-at-9.47.23-PM-1-1024x545.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-21-at-9.47.24-PM-1024x659.jpeg)